painting: రూ.450 కోట్లకు అమ్ముడుపోయిన పెయింటింగ్ ఇది!

  • ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్
  • దుబాయ్‌లో వేలం
  • 'ద జర్నీ ఆఫ్ హ్యుమనిటీ' పేరిట పెయింటింగ్
  • రూపొందించిన బ్రిటిష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ
Artwork from worlds largest canvas painting

ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్  ఇది. దీన్ని తాజాగా దుబాయ్‌లో వేలం వేయ‌గా దాదాపు రూ.450 కోట్ల‌కు ( 62 మిలియన్ డాల‌ర్లకు) అమ్ముడుపోయింది.  'ద జర్నీ ఆఫ్ హ్యుమనిటీ' పేరిట  బ్రిటిష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ ఈ పెయింటింగ్‌ను వేశాడు. ఇందుకోసం 1,065 పెయింట్ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింట్స్ ను ఆయ‌న వాడాడు.

దుబాయ్‌లోని అట్లాంటీస్ హోటల్‌లో  సుమారు ఏడు నెలల పాటు  కష్టపడి ఆయ‌న‌ ఈ పెయింటింగ్ వేశాడు. కరోనా విజృంభ‌ణ స‌మ‌యంలో త‌న స‌మ‌యాన్ని ఈ పెయింటింగ్ కోస‌మే వినియోగించి‌న‌ట్లు ఆయ‌న తెలిపాడు.

70 ముక్కలుగా వేసిన‌ ఈ పెయింటింగ్ ను వేలంలో ఫ్రెంచ్‌కు చెందిన ఆండ్రీ అబ్దున్ అనే వ్యక్తి దక్కించుకున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ అయిన 'ద జర్నీ ఆఫ్ హ్యుమనిటీ గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది.

More Telugu News