Corona Virus: దేశంలో కొత్త‌గా 43,846 మందికి కరోనా నిర్ధారణ

India reports 43846 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,99,130
  • మృతుల సంఖ్య 1,59,755
  • 4,46,03,841 మందికి వ్యాక్సిన్లు
  • మొత్తం 23,35,65,119 కరోనా పరీక్షలు
దేశంలో కొత్త‌ క‌రోనా కేసులు మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. గ‌త‌ 24 గంట‌ల్లో 43,846  మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... కొత్త‌గా 22,956 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,99,130కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 197 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,755కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,30,288 మంది కోలుకున్నారు. 3,09,087 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,46,03,841 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,35,65,119 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,33,602 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News