గ్రాడ్యుయేట్లను డబ్బులతో కొన్నారు: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు

BJP leader Rama Chandra Rao Fires on TRS Govt
  • ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు
  • సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి కల్పించారు
  • వాణీదేవి గెలుపు పీవీది
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పట్టభద్రులను డబ్బులతో కొన్నారని ఆరోపించారు. చివరికి సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. ఎన్నికల్లో విజయం సాధించిన సురభి వాణీదేవికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఈ గెలుపు నిజానికి ఆమెది కాదని, ఆమె తండ్రి పీవీ నరసింహారావుదని అన్నారు.

కాగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి రెండో ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు. ఆమెకు 1,28,010 ఓట్లు రాగా, తన సమీప బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 1,19,198 ఓట్లు పోలయ్యాయి.
Go Back to Shorts
Surabhi Vani Devi
Rama Chandra Rao
TRS
BJP
MLC

More Telugu News