Corona Virus: తెలంగాణలో మ‌ళ్లీ 300కి పైగా న‌మోదైన‌ కొత్త‌ క‌రోనా కేసులు

 Media Bulletin on status of positive cases COVID19 in Telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360
  • కోలుకున్న వారు 2,98,262 మంది
  • మృతుల సంఖ్య 1,664
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 47 మందికి క‌రోనా  
తెలంగాణలో కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ 300కి పైగా న‌మోదైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కొత్త‌గా 313 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 142 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,262 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,664గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2,434 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 943 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 47 మందికి క‌రోనా సోకింది.

  
Corona Virus
COVID19
Telangana

More Telugu News