Corona Virus: దేశంలో కొత్త‌గా 26 వేల‌కు పైగా క‌రోనా కేసులు

India reports 26000 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,85,339
  • మృతుల సంఖ్య 1,58,725
  • కోలుకున్న వారు 1,10,07,352 మంది
  • 2,99,08,038 మందికి వ్యాక్సిన్లు    
దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. కొత్త కేసుల సంఖ్య మ‌ళ్లీ 26 వేలు దాటింది. గత 24 గంటల్లో 26,291 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 17,455 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,85,339కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 118 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,725 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,10,07,352 మంది కోలుకున్నారు. 2,19,262 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 2,99,08,038 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,74,07,413 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,03,772  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News