దేత్తడి హారికను కొనసాగించడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- శ్రీనివాస్ గుప్తా కొత్తగా ఛైర్మన్ అయ్యారు
- అందరూ కూర్చొని మాట్లాడుకుంటాం
- అందరూ ఓకే అనుకుంటే హారికను కొనసాగిస్తాం
శ్రీనివాస్ గుప్తా తొలిసారి ఛైర్మన్ పదవిని చేపట్టారని... దీంతో నిబంధనలను అనుసరించకుండా హారికను నియమించారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆమెను ఎలా నియమించారో తనకు తెలియదని చెప్పారు. ఈ విషయంపై కూర్చొని మాట్లాడుకుంటామని... అందరూ ఓకే అనుకుంటే హారికను కొనసాగిస్తామని తెలిపారు. శ్రీనివాస్ గుప్తాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. టూరిజంశాఖ ఛైర్మన్ గా శ్రీనివాస్ గుప్తా ఉన్న సంగతి తెలిసిందే.