Corona Virus: దేశంలో కొత్త‌గా 16,838 మందికి కరోనా

India reports 16838 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,73,761
  • మృతుల సంఖ్య 1,57,548
  • 1,80,05,503 మందికి వ్యాక్సిన్      
భార‌త్‌లో గత 24 గంటల్లో 16,838 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో అదే స‌మ‌యంలో 13,819 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,73,761కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 113 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,548కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,39,894 మంది కోలుకున్నారు. 1,76,319 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,80,05,503 మందికి వ్యాక్సిన్ వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,99,40,742 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,61,834 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News