పంజా విసురుతున్న రాణిఖేత్!... పెద్దపల్లి జిల్లాలో 3,600 కోళ్లు మృత్యువాత

  • పెద్దంపేట్ గ్రామంలో ఓ పౌల్ట్రీ ఫాంలో రాలిపోతున్న కోళ్లు
  • 4 రోజుల వ్యవధిలో వేల కోళ్లు మృతి
  • ప్రాణాంతక వైరస్ కారణం అయ్యుంటుందన్న అధికారులు
  • నమూనాలు పరీక్షకు పంపిస్తున్నట్టు వెల్లడి
పెద్దపల్లి జిల్లాలో 3,600 కోళ్లు మృత్యువాత పడిన అంశం కలకలం రేపుతోంది. కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దంపేట్ గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫాంలో గత నాలుగు రోజుల వ్యవధిలోనే ఇన్ని కోళ్లు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై జిల్లా వెటర్నరీ అధికారి నారాయణ స్పందిస్తూ, పెద్ద సంఖ్యలో కోళ్లు మరణించడానికి రాణిఖేత్ వ్యాధి కారణం అయ్యుంటుందని అభిప్రాయపడ్డారు.

వైరస్ ప్రభావంతో సంభవించే ఈ వ్యాధి చాలా వేగంగా వ్యాపించడమే కాకుండా, కోళ్ల పాలిట ప్రాణాంతకం అని వివరించారు. కాగా, కోళ్లు మృత్యువాత పడుతున్న పౌల్ట్రీ ఫాం నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపిస్తున్నామని తెలిపారు.

Chicks
Poultry Birds
Death
Ranikhet
Peddampet
Peddapalli District

More Telugu News