Corona Virus: దేశంలో కొత్త‌గా 12,286 మందికి కరోనా నిర్ధారణ

India reports 12286 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,24,527
  • మృతుల సంఖ్య 1,57,248
  • 1,48,54,136 మందికి వ్యాక్సిన్
  • మొత్తం 21,76,18,057 కరోనా పరీక్షలు
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 12,286 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 12,464 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,24,527కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 91 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,248కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,98,921 మంది కోలుకున్నారు. 1,68,358 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,48,54,136 మందికి వ్యాక్సిన్ వేశారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,76,18,057 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,59,283 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News