వామనరావు దంపతుల హత్య కేసు.. రామగిరి పోలీసులకు క్లీన్ చిట్!

  • సంచలనం సృష్టించిన వామనరావు దంపతుల హత్య
  • రామగిరి పోలీసుల సహకారం ఉందని ఆరోపణలు
  • అలాంటిదేమీ లేదని విచారణలో తేలిన వైనం
సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్య కేసులో విచారణ చురుగ్గా సాగుతోంది. ఈ జంట హత్యల కేసులో పెద్దపల్లి జిల్లాలోని రామగిరి పోలీసుల ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణలు దుమారం రేపాయి. దీంతో స్పందించిన డీజీపీ మహేందర్‌రెడ్డి ఐజీ నేతృత్వంలో అంతర్గత విచారణ జరిపించారు. విచారణలో ఆ ఆరోపణలు అవాస్తవమని తేలింది.

వామనరావు దంపతుల హత్యకు రామగిరి పోలీసుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని, ఆ హత్యలకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో తేలడంతో రామగిరి పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే, ఆరోపణల నేపథ్యంలో కేసు విచారణ నుంచి మాత్రం వారిని దూరం పెట్టారు.

Vamanarao
Nagamani
Lawyers
Murder
Ramagiri police

More Telugu News