Corona Virus: దేశంలో కొత్త‌గా 14,264 మందికి కరోనా

India reports 14264 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,91,651 
  • మృతుల సంఖ్య 1,56,302 
  • 1,10,85,173 మందికి వ్యాక్సిన్
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 14,264  మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,667 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,91,651కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 90 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,302 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,89,715 మంది కోలుకున్నారు. 1,45,634 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,10,85,173 మందికి వ్యాక్సిన్ వేశారు.
        
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,09,31,530 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,70,050 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News