ఏం జవాబు చెబితే ఏమనుకుంటారో... పెట్రో ధరల పెంపుపై నిర్మలా సీతారామన్ స్పందన
- దేశంలో పెట్రో మంట.. ఇంధన ధరలు పైపైకి!
- చిరాకు పుట్టించే అంశమన్న నిర్మల
- తానేది మాట్లాడినా తప్పించుకునే ధోరణిలాగే అనిపిస్తుందని విచారం
- ధర్మ సంకట స్థితిని ఎదుర్కొంటున్నట్టు వివరణ
దేశంలో ఇంధన ధరలు సముచిత ధరలకే అందుబాటులోకి వచ్చేందుకు కేంద్రం, రాష్ట్రాలు ఏదో ఒక మార్గాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చమురు ధరలకు రెక్కలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం వాటిని నియంత్రించలేకపోతోందని నిస్సహాయత వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే పెట్రో ధరలను నిర్ణయిస్తున్నాయని తెలిపారు. ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలు పాటించే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని ఆర్థికమంత్రి వెల్లడించారు.