India: దేశంలో కొత్త‌గా 13,993 మందికి కరోనా నిర్ధారణ

India reports 13993 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,77,387
  • మృతుల సంఖ్య 1,56,212
  • యాక్టివ్ కేసులు 1,43,127
  • 1,07,15,204 మందికి వ్యాక్సిన్
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 13,993 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 10,307 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,77,387కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 101 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,212కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,78,048 మంది కోలుకున్నారు. 1,43,127 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,07,15,204 మందికి వ్యాక్సిన్ వేశారు.
          
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,02,61,480 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,86,618 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
India
Corona Virus
COVID19

More Telugu News