Corona Virus: దేశంలో కొత్త‌గా 12,143 మందికి కరోనా

India reports 12143 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,92,746
  • మృతుల సంఖ్య 1,55,550
  • కోలుకున్న వారు 1,06,00,625 మంది
  • 79,67,647 మందికి వ్యాక్సిన్  
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 12,143 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,395 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,92,746కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 103 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,550కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,00,625 మంది కోలుకున్నారు. 1,36,571 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 79,67,647 మందికి వ్యాక్సిన్ వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,55,33,398 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,43,614 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News