స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాజ్యసభలో వైసీపీ వైఖరిని వెల్లడించిన పిల్లి సుభాష్ చంద్రబోస్
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
- కేంద్రం నిర్ణయంపై ఏపీ రాజకీయ పక్షాల వ్యతిరేకత
- ఎంతో పోరాడి తెచ్చుకున్న పరిశ్రమ అన్న వైసీపీ ఎంపీ
- ప్రైవేటీకరణకు అంగీకరించబోమని స్పష్టీకరణ
- సమస్యకు ప్రైవేటీకరణ పరిష్కారం కాబోదని వ్యాఖ్య
ఈ పరిశ్రమపై లక్ష కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని, స్టీల్ ప్లాంట్ బకాయిలపై వడ్డీ రుణమాఫీ ప్రకటించాలని, స్టీల్ ప్లాంటకు సొంతంగా గనులు కేటాయించాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆస్తుల ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. ఇదే అంశంపై సీఎం జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారని, ఈ ప్లాంట్ ను మూడు దశల్లో పునరుద్ధరించాలని కోరారని వెల్లడించారు.