గర్భస్థ శిశువుకు తల్లి ద్వారా కరోనా యాంటీబాడీలు... ఓ అధ్యయనంలో వెల్లడి!
- అమెరికాలో అధ్యయనం
- పెన్సిల్వేనియా ఆసుపత్రిలో గర్భవతులపై పరిశోధన
- 1,470కి పైగా రక్తనమూనాల పరిశీలన
- శిశువుల బొడ్డు తాడులో యాంటీబాడీలు
- 'మాయ' ద్వారా సరఫరా అయినట్టు గుర్తింపు
అమెరికాలోని పెన్సిల్వేనియా ఆసుపత్రిలో 1,470 మందికి పైగా గర్భవతుల నుంచి రక్తనమూనాలు సేకరించి ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఈ పరిశోధన సాగించారు. బిడ్డలకు జన్మనిచ్చిన 83 మంది తల్లుల్లో యాంటీబాడీలను గుర్తించగా, 87 శాతం నవజాత శిశువుల బొడ్డు తాడులో యాంటీబాడీలను కనుగొన్నారు. అంటే తల్లి మాయ నుంచే వారికి యాంటీబాడీల సరఫరా జరిగినట్టు వెల్లడైంది.
తల్లి శరీరంలో ఏ స్థాయిలో యాంటీబాడీలు ఏర్పడ్డాయన్న అంశంపైనే శిశువుల శరీరంలో ఉండే యాంటీబాడీల శాతం ఆధారపడి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. గర్భవతుల కోసం ఎలాంటి కరోనా వ్యాక్సిన్ రూపొందించాలన్న దానిపై తమ అధ్యయనం తోడ్పాటు అందిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.