Corona Virus: దేశంలో కొత్త‌గా 13,052 మందికి కరోనా

India reports 13052 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,46,183
  • మృతుల సంఖ్య 1,54,274
  • కోలుకున్న వారు 1,04,23,125 మంది  
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 13,052 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 13,965 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,46,183 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 127 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,274 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,04,23,125 మంది కోలుకున్నారు. 1,68,784 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
        
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,65,88,372 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,50,964 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News