Corona Virus: దేశంలో కొత్త‌గా 9,102 మందికి కరోనా నిర్ధారణ

India reports 9102 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,76,838
  • మృతుల సంఖ్య 1,53,587
  • మొత్తం 20,23,809 మందికి వ్యాక్సిన్లు
  • 19,30,62,694 కరోనా పరీక్షలు  
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 9,102 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 15,901 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,76,838కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 117 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,587కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,03,45,985 మంది కోలుకున్నారు. 1,77,266 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 20,23,809 మందికి వ్యాక్సిన్లు వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,30,62,694 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,25,577 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News