దేశంలో 41.6 కోట్లకు చేరిన జన్ధన్ ఖాతాల లబ్ధిదారుల సంఖ్య
- 2014లో స్వాతంత్య్ర దినోత్సవాన ప్రారంభించిన మోదీ
- గణనీయంగా తగ్గిన జీరో ఖాతాలు
- 2018లో పీఎంజేడీవై 2.0ను ప్రారంభించిన కేంద్రం
2018లో ఈ పథకానికి మరిన్ని మెరుగులద్దిన కేంద్రం ‘పీఎంజేడీవై 2.0’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా 28 ఆగస్టు 2018 తర్వాత జన్ధన్ ఖాతాలు తెరిచిన వారికి రూపేకార్డులపై ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న ప్రమాద బీమాను రూ. 2 లక్షలకు పెంచింది. ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) పరిమితిని డబుల్ చేసి రూ. 10 వేలకు పెంచింది.