India: దేశంలో కొత్త‌గా 15,968 క‌రోనా కేసులు

   India reports  new 15968  COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,95,147
  • మృతుల సంఖ్య 1,51,529
  • కోలుకున్న వారు 1,01,29,111 మంది
దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 15,968 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 17,817 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,95,147కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 202 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,51,529కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,01,29,111 మంది కోలుకున్నారు.  2,14,507 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 18,34,89,114 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,36,227 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
India
Corona Virus
COVID19

More Telugu News