ఇండోనేషియా విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్ దొరికింది!
- జావా సముద్రంలో కుప్పకూలిన విమానం
- విమానంలో 62 మంది
- బ్లాక్ బాక్స్, వాయిస్ రికార్డర్ లను గుర్తించిన నిపుణులు
- డేటాను పరిశీలిస్తే ప్రమాద కారణాలు వెల్లడయ్యే అవకాశం
బ్లాక్ బాక్స్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్లలో నిక్షిప్తమైన డేటాను పరిశీలిస్తే... విమానం ఎందుకు కూలిపోయింది? సాంకేతిక వైఫల్యంతో కుప్పకూలిందా? చివరి క్షణాల్లో కాక్ పిట్ లో ఉన్న పైలెట్ల మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది? అనే అంశాలు వెల్లడికానున్నాయి. ఇండోనేషియాకు చెందిన సిరివిజయ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737-500 విమానం రాజధాని జకార్తా నుంచి పాంటియానక్ వెళుతుండగా, టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో 56 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.