అసదుద్దీన్కు షాక్.. టీఎంసీలో చేరిన బెంగాల్ ఎంఐఎం అధ్యక్షుడు
- అనుచరులతో కలిసి మమత పార్టీలో చేరిన ఎస్కే అబ్దుల్ కలాం
- అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని అసద్ యోచన
- అసద్కు ఎదురుదెబ్బేనంటున్న రాజకీయ విశ్లేషకులు
గతేడాది బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేసిన అసద్ పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోని ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాల్లో బరిలోకి దిగాలని అసద్ నిర్ణయించారు. నిజానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి పోటీ చేయాలని అసద్ ప్రతిపాదించినప్పటికీ అందుకు మమత ససేమిరా అన్నట్టు తెలిసింది. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ బెంగాల్ చీఫ్ టీఎంసీలో చేరడం ఎంఐఎంకు షాకేనని చెబుతున్నారు.