సిరాజ్, బుమ్రాలపై సిడ్నీలో జాతి వివక్ష వ్యాఖ్యలు... ఫిర్యాదు చేసిన టీమిండియా
- సిడ్నీలో మూడో టెస్టు ఆడుతున్న భారత్, ఆసీస్
- భారత ఆటగాళ్లపై నోరు పారేసుకున్న ప్రేక్షకులు
- మేనేజ్ మెంట్ కు సమాచారం అందించిన బుమ్రా, సిరాజ్
- ఐసీసీ దృష్టికి తీసుకెళ్లిన టీమిండియా మేనేజ్ మెంట్
ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ... టీమిండియా ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఉపక్రమించింది. సిడ్నీ క్రికెట్ మైదానం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న 'వెన్యూస్ న్యూసౌత్ వేల్స్' తో కలిసి సీసీ టీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తోంది. ఆస్ట్రేలియాలో పర్యటించే క్రికెట్ జట్లకు ఇలాంటి అనుభవాలు కొత్త కాదు. గతంలోనూ అనేక వివాదాలు వర్ణ వివక్ష వ్యాఖ్యల ఫలితంగానే జరిగాయి.