Corona Virus: దేశంలో కొత్త‌గా 18,222 మందికి కరోనా నిర్ధారణ

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,31,639
  • మృతుల సంఖ్య  1,50,798
  • కోలుకున్న వారు 1,00,56,651 మంది
India reports 18222 new COVID19 cases

దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 18,222 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 19,253 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,31,639కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 228 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,50,798 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  1,00,56,651 మంది కోలుకున్నారు.  2,24,190 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 18,02,53,315 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,16,951 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News