మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు వలంటీర్ల నమోదు పూర్తి: భారత్ బయోటెక్ ప్రకటన

Covaxin third phase clinical trials enrollment completed
  • అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన కొవాగ్జిన్
  • మూడో దశ క్లినికల్ ప్రయోగాల దశలో వ్యాక్సిన్
  • తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి
  • మూడో దశలో 26 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యం
  • 28,500 మంది పేర్ల నమోదు
భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన కరోనా వ్యాక్సిన్లలో కొవాగ్జిన్ ఒకటి. హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఐసీఎంఆర్ తో కలిసి సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. ఇప్పటికే తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాగా, ప్రస్తుతం కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ప్రయోగాల దశలో ఉంది. తాజాగా, ఈ మూడో దశ ప్రయోగాల కోసం వలంటీర్ల నమోదు ప్రక్రియ పూర్తయిందని భారత్ బయోటెక్ వెల్లడించింది.

మూడో దశ క్లినికల్ ప్రయోగాల కోసం తాము 26  వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని భావించామని, 25,800 మంది వలంటీర్లు ముందుకొచ్చారని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ సంస్థ జేఎండీ సుచిత్రా ఎల్ల తెలిపారు. వ్యాక్సిన్  అభివృద్ధి చేసే క్రమంలో తమకు సహకరిస్తున్న అందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.
Go Back to Shorts
COVAXIN
Clinical Trials
Third Phase
Bharat Biotech
Vaccine
India

More Telugu News