ప్రజాస్వామ్యంలో ఇలాంటిది కూడదు.. అమెరికా కాల్పుల ఘటనపై మోదీ
- బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సమావేశం
- చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన ట్రంప్ మద్దతుదారులు
- హింసాత్మక ఘటన బాధ కలిగించిందన్న మోదీ
వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు ఈ క్రమంలో కాల్పులు జరిపారు. బాష్పవాయువు ప్రయోగించారు. పోలీసు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై మోదీ స్పందించారు. వాషింగ్టన్లో జరిగిన హింసాత్మక ఘటన బాధ కలిగించిందన్నారు. అమెరికాలో అధికార బదిలీ శాంతియుతంగా జరగాలని, నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియను ఆటంకపరచడం సరికాదంటూ ట్వీట్ చేశారు.