Corona Virus: దేశంలో మ‌రో 16,505 మందికి కరోనా నిర్ధారణ

India reports 16505 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,40,470
  • మృతుల సంఖ్య 1,49,649
  • మొత్తం 17,56,35,761 కరోనా పరీక్షలు
కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 16,505 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 19,557 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,03,40,470కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 214 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,49,649కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 99,46,867 మంది కోలుకున్నారు. 2,43,953 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 17,56,35,761 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,35,978 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News