Corona Virus: దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

With 22272 new COVID19 infections
  • 24 గంటల్లో 22,272 మందికి కరోనా నిర్ధారణ
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,69,118
  • మృతుల సంఖ్య 1,47,343
  • మొత్తం 16,71,59,289 కరోనా పరీక్షలు
భారత్‌లో గత 24 గంటల్లో 22,272 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 22,274 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,69,118కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 251 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,47,343 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 97,40,108 మంది కోలుకున్నారు.  2,81,667  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 16,71,59,289 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న  8,53,527 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News