తప్పనిసరిగా వార్తాపత్రికలు చదవాలని మా పిల్లలకు చెబుతుంటా: సోనూ సూద్
- వార్తాపత్రికల ప్రాముఖ్యత వివరించిన సోనూ సూద్
- తన జీవితంలో వీడదీయరాని భాగం అని వెల్లడి
- బాల్యంలో స్కూల్లో తప్పనిసరిగా చదివించేవారని వివరణ
- తల్లిదండ్రుల కోసం ప్రతిరోజూ న్యూస్ పేపర్ తెచ్చేవాడ్నన్న సోనూ
- ప్రపంచంలో ఏం జరుగుతోందో విద్యార్థులు తెలుసుకోవాలని సూచన
తాను స్కూల్లో చదువుకునే రోజుల్లో న్యూస్ పేపర్లు చదవడం కూడా బోధనలో భాగంగా ఉండేదని, క్లాసులో ప్రతిరోజు 20 వార్తల వరకు చదవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో ఏం జరుగుతోందో విద్యార్థులకు కూడా తెలియాలంటే ఇలాంటి కార్యాచరణను స్కూళ్లలో తప్పనిసరి చేయాలని సోనూ సూద్ సూచించారు.
పంజాబ్ లోని తన సొంత ఊర్లో ఉన్నప్పుడు కూడా తన తల్లిదండ్రుల కోసం వార్తాపత్రికలు తీసుకురావడం తన దినచర్యలో ఓ భాగం అని వెల్లడించారు. ఇప్పటికీ న్యూస్ పేపర్లు తన జీవితంలో విడదీయరానివిగా మారిపోయాయని పేర్కొన్నారు.