Corona Virus: దేశంలో 97 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య

 Indias total cases rise to 9703770
  • 24 గంటల్లో 26,567 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,03,770
  • మృతుల సంఖ్య 1,40,958
  • కోలుకున్న వారు 91,78,946 మంది  
భారత్‌లో కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 26,567 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,03,770కి చేరింది. ఇక గత 24 గంటల్లో 39,045 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 385 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,40,958కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 91,78,946 మంది కోలుకున్నారు. 3,83,866 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,88,14,055 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,26,399 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News