Corona Virus: దేశంలో కొత్తగా 36,594 మందికి కరోనా నిర్ధారణ

Indias total cases rise to 9571559
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,71,559
  • మృతుల సంఖ్య 1,39,188
  • కోలుకున్న వారు 90,16,289 మంది
భారత్‌లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 36,594 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,71,559కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,916 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 540 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,39,188కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 90,16,289 మంది కోలుకున్నారు. 4,16,082  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
                        
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,47,27,749 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,70,102  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News