బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టును నిర్మించాలని భారత్ నిర్ణయం!

India to Build a New Project on Brahmaputra
  • 60 గిగావాట్ల ప్రాజెక్టును ప్రకటించిన చైనా
  • అరుణాచల్ ఎగువ భాగాన భారత్ ప్రాజెక్టు
  • వెల్లడించిన జల వనరుల శాఖ
టిబెట్ పరిధిలో యుర్లుంగ్ త్సంగ్ బో (బ్రహ్మపుత్ర నది)పై 60 గిగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నామని చైనా ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తమైన భారత్, అరుణాచల్ ప్రదేశ్ పరిధిలో 10 గిగావాట్ల ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించింది. ఈ నదిపై చైనా ప్రాజెక్టుల కారణంగా ఇండియాలో అకస్మాత్తుగా వరదలు రావడం, నదిలో నీరు లేని వేళ, పై నుంచి విడుదల చేయక, నీటి కొరత ఏర్పడుతూ ఉండటం తదితరాల నేపథ్యంలోనే, అరుణాచల్ ఎగువ ప్రాంతాన ఈ భారీ డ్యామ్ ను నిర్మించడం ద్వారా చైనా ప్రాజెక్టుల ప్రభావాన్ని తగ్గించాలని నిర్ణయించామని కేంద్ర జల వనరుల శాఖ సీనియర్ అధికారి టీఎస్ మెహ్రా వెల్లడించారు.

ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే చైనా, ఇండియాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనివున్న నేపథ్యంలో నదీ జలాల వివాదాలు వాటిని మరింతగా పెంచవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ కొత్త ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ఇండియాపై చైనా జలాశయాల ప్రభావం తగ్గుతుందని, పైగా నీటిని మనం కూడా నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుందని మెహ్రా వెల్లడించారు.
Go Back to Shorts
Brahmaputra
River
China
India
Project

More Telugu News