Corona Virus: దేశంలో కొత్తగా 31,118 మందికి కరోనా నిర్ధారణ

new 31118 COVID19 infections in India
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 94,62,810
  • మృతుల సంఖ్య 1,37,621
  • ఇప్పటివరకు కోలుకున్న వారు 88,89,585 మంది
భారత్‌లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 31,118 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 94,62,810కి చేరింది. ఇక గత 24 గంటల్లో 41,985 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 482 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,37,621 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 88,89,585 మంది కోలుకున్నారు. 4,35,603 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
Corona Virus
COVID19
India

More Telugu News