Corona Virus: దేశంలో కొత్తగా 41,322 మందికి కరోనా నిర్ధారణ

With 41322 new COVID19 infections in India
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,51,110 
  • మృతుల సంఖ్య  1,36,200
  • కోలుకున్న వారు 87,59,969 మంది
  • యాక్టివ్ కేసులు 4,54,940  
దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 41,322 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,51,110 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 41,452 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 485 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,36,200 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 87,59,969 మంది కోలుకున్నారు. 4,54,940 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
Corona Virus
COVID19
India

More Telugu News