పాకిస్థాన్, బంగ్లాదేశ్ లను భారత్లో విలీనం చేస్తామంటే మేం స్వాగతిస్తాం: ఎన్సీపీ
- కరాచీ భారత్లో భాగం అవుతుందన్న ఫడ్నవీస్ వ్యాఖ్యలకు మద్దతు
- బెర్లిన్ గోడే కూలగా లేనిది మూడు దేశాలూ ఒక్కటి కావా?
- బీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేనతో కలిసి పోటీ చేస్తాం
బెర్లిన్ గోడే కూలిందని, అలాంటిది పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారత్లు ఎందుకు కలవవని ప్రశ్నించారు. ఈ మూడింటినీ కలిపి ఒకే దేశంగా మార్చాలని కనుక బీజేపీ భావిస్తే అందుకు తాము పూర్తి మద్దతు ఇస్తామన్నారు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంఎసీ) ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తామన్నారు. ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉందన్న ఆయన తమ పార్టీ కోసం పనిచేసుకునే హక్కు ప్రతి పార్టీకి ఉంటుందన్నారు. ప్రతి పార్టీ అదే చేస్తుందన్నారు. తాము కూడా తమ పార్టీని బలోపేతం చేసుకుంటామని మాలిక్ అన్నారు.