Corona Virus: దేశంలో కొత్తగా 38,617 మందికి కరోనా నిర్ధారణ

38617 fresh COVID 19 cases in India
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 89,12,908
  • మృతుల సంఖ్య 1,30,993
  • కోలుకున్న వారు 83,35,110 మంది
  • మొత్తం 12,74,80,186 కరోనా పరీక్షలు
దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 38,617 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 89,12,908 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 44,739 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 474 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,30,993 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 83,35,110 మంది కోలుకున్నారు. 4,46,805 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.              
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 12,74,80,186 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,37,279 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News