జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పోటీపై క్లారిటీ ఇచ్చిన ఎల్.రమణ

  • డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్
  • టీడీపీ పోటీ చేస్తుందని చెప్పిన రమణ
  • బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేస్తామని వెల్లడి
జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. 13 రోజుల వ్యవధిలోనే ఎన్నికల ప్రక్రియ ముగియనున్న తరుణంలో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ పోటీ చేయడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ క్లారిటీ ఇచ్చారు.

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. ఈరోజు కానీ, రేపు కానీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. పొత్తులు లేకుండానే ఈ ఎన్నికల్లో పోటీ  చేయబోతున్నామని తెలిపారు. అయితే అన్ని స్థానాల్లో కాకుండా కేవలం బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేస్తామని చెప్పారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది చంద్రబాబేనని... నగరంలో ఓటు అడిగే హక్కు టీడీపీకి మాత్రమే ఉందని తెలిపారు.

GHMC Elections
TTDP
Telugudesam
L Ramana

More Telugu News