Devineni Uma: అప్పుడు విమర్శించారు.. నేడు 30 ఏళ్లకు పీపీఏ ఎలా కుదుర్చుకుంటారు?: దేవినేని ఉమ

devineni uma slams jagan
  • 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ వాడకానికి ఒప్పందాలు
  • ఇప్పటికే 20 వేల మెగావాట్ల ఒప్పందాలు
  • ధరల తగ్గింపుతో మరో ఒప్పందం ఎవరికోసం
  • నాడు టీడీపీ ఒప్పందాన్ని విమర్శించారు
పీపీఏలపై నాడు అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడిన మాటలను పోస్ట్ చేస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఆ రోజు ఒకలా మాట్లాడిన జగన్ ఈ రోజు మరోలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.  

‘10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ వాడకానికి ఇప్పటికే 20 వేల మెగావాట్ల ఒప్పందాలు. ఉత్పత్తి నిలిపివేస్తే పరిహారం. 4 నెలలకు సరిపడా ఎల్సీలు, లీజు ధరల తగ్గింపుతో మరో ఒప్పందం ఎవరికోసం అంటున్న ఉద్యోగ సంఘాలు. నాడు తెలుగు దేశం పార్టీ పాతికేళ్ల ఒప్పందాన్ని విమర్శించి నేడు 30 ఏళ్లకు పీపీఏ ఎలా కుదుర్చుకుంటారు వైఎస్ జగన్’ అని దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News