Corona Virus: దేశంలో 80 లక్షలు దాటిన కరోనా కేసులు

 cross 80 lakh with 49881 fresh cases
  • గత 24 గంటల్లో 49,881 మందికి కరోనా 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,40,203
  • మృతుల సంఖ్య 1,20,527
  • కోలుకున్న వారు 73,15,989 మంది   
దేశంలో కరోనా కేసుల సంఖ్య 80 లక్షలు దాటింది. కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 49,881 మందికి కరోనా నిర్ధారణ అయిందని  పేర్కొంది. అదే సమయంలో 56,480 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,40,203 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 517 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,20,527  కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 73,15,989 మంది కోలుకున్నారు. 6,03,687 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
        
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 10,65,63,440 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,75,760  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News