Corona Virus: దేశంలో 73 లక్షలు దాటిన కరోనా కేసులు

India reports a spike of 67708 new COVID19 cases
  • గత 24 గంటల్లో 67,708 మందికి కరోనా 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,07,098
  • మృతుల సంఖ్య 1,11,266
దేశంలో కరోనా కేసుల సంఖ్య 73 లక్షలు దాటింది. భారత్‌లో గత 24 గంటల్లో 67,708 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,07,098 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 680 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,11,266 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 63,83,442 మంది కోలుకున్నారు. 8,12,390 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,12,26,305 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,36,183 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News