Ambedkar: తూర్పు గోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం

  • రాజోలు మండలంలో ఘటన
  • విగ్రహం ముక్కు పగులగొట్టిన దుండగులు
  • కేసు నమోదు చేస్తామన్న పోలీసులు
Ambedkar statue vandalized in East Godavari district

తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం కాట్రేనిపాడులో రాజ్యాంగనిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కొద్దిమేర ధ్వంసం చేశారు. విగ్రహం ముక్కు పగులగొట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విగ్రహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More Telugu News