శర్వా 'మహాసముద్రం' చిత్రంలో హీరోయిన్ గా అదితి రావు హైదరీ

  • అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం
  • కీలక పాత్ర పోషిస్తున్న సిద్ధార్థ్
  • తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం
శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధానపాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం 'మహాసముద్రం'. ఈ చిత్రంలో హీరోయిన్ గా అదితి రావు హైదరీ నటిస్తోందని చిత్ర యూనిట్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.

లవ్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ వైజాగ్ నేపథ్యంలో నడుస్తుందని సమాచారం. 'మహాసముద్రం' చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళంలో చిత్రీకరిస్తున్నారు.  

'ఆర్ఎక్స్ 100' చిత్రం తర్వాత అజయ్ భూపతి చేస్తున్న సినిమా ఇదే. ఇక, అదితి రావు హైదరీ తమ చిత్రంలో ఓ లీడ్ రోల్ పోషిస్తున్నారని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ ట్వీట్ చేసింది. గాలిని మోసుకొచ్చే అలలా అదితిరావు హైదరీ మా టీమ్ లో జాయినవుతోంది... ఆమెకు స్వాగతం అంటూ పేర్కొంది.

Aditi Rao Hydari
Mahasamudram
Sharwanand
Sidharth
Ajay Bhupathi
AK Entertainments
Tollywood

More Telugu News