Corona Virus: దేశంలో 70 లక్షలకు చేరువైన కరోనా కేసులు

India reports a spike of 73272 new COVID19 cases
  • గత 24 గంటల్లో 73,272 మందికి కరోనా 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 69,79,424  
  • మృతుల సంఖ్య 1,07,416
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 70 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో 73,272 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 69,79,424 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 926 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,07,416 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 59,88,823 మంది కోలుకున్నారు. 8,83,185 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.          
         కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 8,57,98,698 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,64,018 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News