Devineni Uma: టీడీపీ నేత పట్టాభి కారుపై దాడి పట్ల దేవినేని ఉమ, బోండా ఉమ ఆగ్రహం

devineni uma bonda uma slams jagan
  • ప్రభుత్వ అవినీతిని, అసమర్థతను పట్టాభి ప్రశ్నిస్తున్నారు
  • సమాధానం చెప్పలేక కారు ధ్వంసం
  • ఇది ప్రభుత్వ పిరికిపంద చర్య
  • దాడులు జరుపుతూ వైసీపీ భయపెట్టాలని ప్రయత్నిస్తోంది
టీడీపీ నేత పట్టాభిరామ్ కారుపై కొందరు దుండగులు దాడి చేసి, దాని అద్దాలను పగుటకొట్టిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ అవినీతిని, అసమర్థతను ప్రశ్నిస్తున్న పట్టాభికి సమాధానం చెప్పలేక కారు ధ్వంసం చేయడం దుర్మార్గం. ఇది ప్రభుత్వ పిరికిపంద చర్య. నిన్న సబ్బంహరి, నేడు పట్టాభి మీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ధైర్యం ఉంటే పట్టాభి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి' అని దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కారు ధ్వంసం ఘటనపై టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు స్పందిస్తూ.. ఈ ఘటన చాలా దుర్మార్గమని అన్నారు. విజయవాడలో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని ఆయన చెప్పారు. ఇలాంటి దాడులు జరుపుతూ వైసీపీ భయపెట్టాలని ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. ఇటువంటి ఘటనల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Devineni Uma
YSRCP
Andhra Pradesh

More Telugu News