Corona Virus: దేశంలో కరోనా విజృంభణ... అప్‌డేట్స్‌

COVID19 tally crosses 65lakh mark
  • 24 గంటల్లో 75,829 మందికి కరోనా 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 65,49,374
  • మృతుల సంఖ్య 1,01,782
భారత్‌లో గత 24 గంటల్లో 75,829 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 65,49,374 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 940 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,01,782 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 55,09,967 మంది కోలుకున్నారు. 9,37,625 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.          
            
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,89,92,534 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,42,131 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News