Saiee Manjrekar: మహేశ్ బాబు నిర్మిస్తున్న చిత్రంలో బాలీవుడ్ భామ!

Saiee Manjrekar signs for Mahesh Babus production
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఫిలిం మేకర్ మహేశ్ మంజ్రేకర్ కూతురు, 'దబాంగ్ 3' చిత్రం ద్వారా పేరుతెచ్చుకున్న సయీ మంజ్రేకర్ తాజాగా ఓ తెలుగు సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. అడివి శేష్ కథానాయకుడుగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న 'మేజర్' చిత్రంలో కథానాయికగా ఆమె నటిస్తోంది.

ప్రముఖ కథానాయకుడు మహేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. 2008లో ముంబైలో జరిగిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడుల సందర్భంగా వీరోచితంగా పోరాడి, వీరమరణం పొందిన ఎన్.ఎస్.జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ కథతో ఈ 'మేజర్' చిత్రం రూపొందుతోంది. తెలుగుతో పాటు హిందీలో కూడా దీనిని ఏకకాలంలో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే సగం షూటింగ్ పూర్తికాగా, సయీ మంజ్రేకర్ ఇందులో నటిస్తున్నట్టుగా ఈ రోజు ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రకథ వినగానే వెంటనే ఓకే చెప్పేశానని సయీ చెప్పింది. 'స్క్రిప్టుతో పాటు నా పాత్ర ఇంపాక్ట్ ఎలా వుందనేదే నాకు ముఖ్యం. అది నాకు ఈ మేజర్ స్క్రిప్టులో కనిపించింది. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను' అని చెప్పింది. మంచి అవకాశాలు వస్తే దక్షిణాది భాషల్లో చేయడానికి తనకి అభ్యంతరం లేదని ఈ చిన్నది తెలిపింది.
Go Back to Shorts
Saiee Manjrekar
Adivi Sesh
Mahesh Babu

More Telugu News