రైతులకు అండగాలేని ఇలాంటి చట్టాలెందుకు?: కేంద్ర వ్యవసాయ చట్టం బిల్లుపై కేకే వ్యాఖ్యలు

TRS Parliamentary leader Keshavarao hits out new agriculture bill
  • కేంద్ర నూతన వ్యవసాయ బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్ ఎంపీలు
  • రైతులకు తీరని నష్టం జరుగుతుందన్న కె.కేశవరావు
  • కార్పొరేట్లకు మేలు చేసేలా ఉందని విమర్శలు
కేంద్రం నూతనంగా వ్యవసాయ చట్టం తీసుకురావాలనుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ కేంద్ర వ్యవసాయ చట్టం బిల్లును టీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారు ఈ వ్యవసాయ బిల్లుకు ఆమోదం తెలుపలేదు. దీనిపై  టీఆర్ఎస్ పక్ష పార్లమెంటరీ నేత కె.కేశవరావు స్పందించారు.

ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, రైతులకు అండగా లేని ఇలాంటి చట్టాలు ఎందుకని ప్రశ్నించారు. కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు తీరని నష్టం కలిగే అవకాశం ఉందని అన్నారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్లకు మేలు చేసేలా ఈ కొత్త చట్టం ఉందని, మార్కెటింగ్ ఏజెంట్లకు సైతం ఈ చట్టంతో నష్టాలు తప్పవని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందని కేకే విమర్శించారు. వ్యవసాయం, దాని అనుబంధ అంశాలు ఎల్లప్పుడూ రాష్ట్ర పరిధిలోనే ఉండాలని  స్పష్టం చేశారు.
Go Back to Shorts
K.Keshavarao
Agriculture Bill
Centre
TRS
KCR

More Telugu News