ఏపీలో రేపటి నుంచే రోడ్డెక్కనున్న సిటీ బస్సులు!
- మార్చి నుంచి నిలిచిపోయిన సేవలు
- పరిమిత సంఖ్యలో 19 నుంచి అనుమతి
- ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ అధికారులు
బస్సుల్లో భౌతిక దూరం తప్పనిసరని, ప్రయాణికులు దూరదూరంగా ఉండి ప్రయాణించే ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. తొలి దశలో పరిమిత సంఖ్యలోనే బస్సులు నడుస్తాయని, తదుపరి పరిస్థితిని మరోసారి సమీక్షించి, బస్సుల సంఖ్యను మరింతగా పెంచుతామని తెలిపారు.