నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఏపీ మంత్రి జయరాం సవాల్
- ఆస్పరిలో భూములు కొనుగోలుపై మంత్రి జయరాంపై ఆరోపణలు
- తాను భూకబ్జాదారుడిని కాదని జయరాం వ్యాఖ్య
- కొన్ని పేపర్లలో వచ్చే వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మండిపాటు
తన జీవితంలో తాను ఎవరిపై దౌర్జన్యం చేయలేదని, కబ్జాలకు పాల్పడటం తన చరిత్రలో లేదని జయరాం అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న మను అనే వ్యక్తి మంజునాథ్ బాబాయ్ అని తెలిపారు. కొన్ని పేపర్లలో వచ్చే వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని... తనపై అసత్య ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. తాను కబ్జా చేసినట్టు నిరూపిస్తే... రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.