ఏపీకి రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం!

  • 14 రాష్ట్రాలకు రూ. 6,195 కోట్లు విడుదల
  • ఏపీకి రూ. 491 కోట్లు విడుదల
  • 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు నిధులు
ఆర్థిక సమస్యల్లో ఉన్న ఏపీకి కొంత ఊరట లభించినట్టైంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రెవెన్యూ లోటు నిధులను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు సంబంధించి రూ. 6,195.08 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందులో ఏపీకి రూ. 491.41 కోట్లను రిలీజ్ చేసింది. 2020 నుంచి 2025 మధ్య కాలానికి గాను రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాను ఆర్థిక సంఘం తేలుస్తుంది. వివిధ రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసిన రెవెన్యూ లోటు నిధుల విడుదల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

15th Finance Commission
Andhra Pradesh
Revenue defecit budget

More Telugu News